Share News

AP News: రెచ్చిపోతున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు

ABN , Publish Date - May 16 , 2024 | 08:35 AM

నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు, కిరాయి రౌడీమూకలు రెచ్చిపోతున్నాయి. దీంతో పలు గ్రామాలు ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. టీడీపీ శ్రేణులు, సానుభూతిపరులపై వరుస దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి.

AP News:  రెచ్చిపోతున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు

నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గం (Sarvepalli Constituency)లో మంత్రి (Minister) కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) అనుచరులు (Followers), కిరాయి రౌడీమూకలు రెచ్చిపోతున్నాయి. దీంతో పలు గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. టీడీపీ శ్రేణులు (TDP Activists), సానుభూతిపరులపై వరుస దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి. బయట ప్రాంతాల నుంచి కరుడుగట్టిన నేరస్థులను మంత్రి కాకాణి అనుచరులు రప్పించారు. నడిరోడ్లపై కర్రలు, మారణాయుధాలు చేతబట్టి కిరాయి రౌడీ మూకలు హల్ చల్ చేస్తున్నాయి.


నెల్లూరు జిల్లా, సర్వేపల్లిలో టీడీపీ నేత (TDP Leader) గంపా విజయ్ (Gampa Vijay) ఇంటిపై వైసీపీ (YCP) రౌడీమూకలు దాడులు చేశాయి, ఇంటి చుట్టూ ఉన్న దడులను ధ్వంసం చేశాయి. చింతోపులో టీడీపీ కార్యకర్త చంద్రశేఖర్ (Chandrasekhar), ఆయన తల్లి దొరసానమ్మలపై వైసీపీ మూకలు దాడి చేశాయి. వెంకటాచలంలో షేక్ నూర్జాహాన్ అనే మహిళని తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ దాడి చేసాయి. కాగా సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి అనుచరులు, కిరాయి రౌడీమూకల అరాచకాలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) సీరియస్ అయ్యారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అరాచకాలను జిల్లా ఎస్పీకి తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కోట్ల ఆస్తికి వారసుడే అయినా..

ఆ ఇద్దరు మంత్రులకు దడ..!

మోసం చేసిన ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి..!

నిద్రలోనే అగ్నికి ఆహుతి

రాష్ట్రంలో ఏం జరుగుతోంది?

దుమ్మురేపిన ఓటర్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 16 , 2024 | 08:44 AM